క్రీడలు

తెలుగు సినిమాలపై సెహ్వాగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Virender Sehwag: టీమిండియా మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ రిటైర్మెంట్ తర్వాత తన జీవితం గురించి సరదాగా మాట్లాడారు. హైదరాబాద్‌లో టాలీవుడ్ ప్రో లీగ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తెలుగు సినిమాలపై తనకున్న ఇష్టాన్ని వెల్లడించారు. మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్ సినిమాలు చూడటమే తన పనిగా చెప్పారు.

భారత మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ క్రికెట్ నుంచి పూర్తిగా తప్పుకున్న తర్వాత ఖాళీ సమయంలో మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్ సినిమాలు చూడటమే తన ప్రధాన పనిగా ఉందని నవ్వుతూ చెప్పారు. మహేష్ బాబును ఎంతో ఇష్టపడతానని, ప్రభాస్ నటించిన బాహుబలిని రెండు సార్లు చూశానని తెలిపారు. భాష అర్థం కాకపోయినా హిందీ డబ్బింగ్‌లో అయినా తెలుగు సినిమాలు వదలనని అన్నారు.

అల్లు అర్జున్ పుష్ప సినిమాలోని ‘తగ్గేదే లే’ డైలాగ్, ఆ మేనరిజం తనకు బాగా గుర్తుండిపోయాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కపిల్ దేవ్, సురేష్ రైనా కూడా పాల్గొన్నారు. నిర్మాత దిల్ రాజు పోస్టర్‌ను ఆవిష్కరించారు. సెహ్వాగ్ మాటల్లో తెలుగు స్టార్ల పట్ల గౌరవం స్పష్టంగా కనిపించింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button