తెలంగాణ

Vemulawada: మే 14న వేములవాడ బంద్‌కు పిలుపు

Vemulawada: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని మూసివేయాలనే ప్రతిపాదనను వివిధ వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. అభివృద్ధి ప్రతిపాదనకు వ్యతిరేకం కానప్పటికీ, పనులు చేపట్టిన తర్వాత ఆలయాన్ని మూసివేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. జూన్ 15 నుండి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆలయాన్ని మూసివేతకు నిరసనగా మే 14న ఆలయ పట్టణ బంద్‌కు పిలుపునిచ్చినట్లు బీజేపీ నేత రామకృష్ణ తెలిపారు.

పుర ప్రముఖులతో రాజన్న ఆలయ పరిరక్షణ సమితిని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అభివృద్ధి విస్తరణ కార్యక్రమాలకు తాము వ్యతిరేకంగా కాదన్నారు. చారిత్రక ప్రాశస్త్యం ఉన్న అనుబంధ ఆలయాలను తొలగిస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. ఆలయ అభివృద్ధి పనులు కొనసాగిస్తూనే స్వామివారికి నిత్య పూజలతో పాటు భక్తులకు దర్శనం అనుమతి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button