తెలంగాణ
అవమానించాడని తాతను కత్తితో పొడిచి పొడిచి చంపిన మనవడు

తాతను చంపిన కేసులో కీర్తితేజ పోలీస్ కస్టడీ ముగిసింది. కోర్టు ఆదేశాలతో కస్టడీకి తీసుకున్న పోలీసులు.. మూడ్రోజులపాటు విచారించారు. మొదటిరోజు వేసిన ప్రశ్నలకు కీర్తితేజ సమాధానం ఇవ్వకుండా తమకు సపోర్టు చేయకుండా మౌనం వహించాడని చెప్పారు.
అయితే మిగితా రెండ్రోజుల విచారణలో మాత్రం కీర్తితేజ నుండి కీలక విషయాలు రాబట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. తనను అవమానించినందుకే తాతను చంపినట్లు కీర్తితేజ పోలీసులకు చెప్పాడు. ఇక హత్యకు వాడిన దుస్తులు, కత్తి తగలబెట్టేందుకు యత్నించినట్లు తమతో చెప్పాడని పోలీసులు చెబుతున్నారు.