ఆంధ్ర ప్రదేశ్
Vallabhaneni Vamsi: రెండో రోజు ముగిసిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విచారణ

Vallabhaneni Vamsi: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విచారణ రెండో రోజు ముగిసింది. వంశీని అధికారులు 5గంటల పాటు విచారించారు. సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపుల వెనుక ఎవరున్నారనే దానిపై అధికారులు ఆరా తీశారు.
టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా పోలీసులు విచారించారు. వైద్య పరీక్షల కోసం వంశీని కృష్ణలంక పీఎస్ నుంచి జీజీహెచ్కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం వంశీని పోలీసులు జిల్లా జైలుకు తరలించనున్నారు.