తెలంగాణ
Uttam Kumar Reddy: NDSA నివేదిక చూసి బీఆర్ఎస్ సిగ్గు పడాలి

Uttam Kumar Reddy: బీఆర్ఎస్ నేతలపై మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి మండిపడ్డారు. NDSA నివేదిక చూసి.. బీఆర్ఎస్ నేతలు సిగ్గు పడాలన్నారు. కాళేశ్వరంతో అద్భుతాలు సృష్టిస్తున్నామని చెప్పి లక్ష కోట్లు ప్రాజెక్ట్ కట్టారని ఆయన విమర్శించారు. మీరే డిజైన్ చేశారు.. మీరే కట్టారు.. మీరుండగానే కూలిందన్నారు. మేడిగడ్డ, సుందిళ్ల నిరుపయోగంగా ఉన్నప్పటికీ రికార్డు స్థాయిలో పంటలు వచ్చాయన్నారు.
అబద్ధాలు, తప్పులపై బతకాలి అని బీఆర్ఎస్ అనుకుంటోందన్నారు. వచ్చే కేబినెట్లో NDSA నివేదికపై చర్చించి చర్యలు తీసుకుంటామన్నారు. ఎవడి అయ్య జాగీరు అని ప్రాజెక్ట్ కట్టారని ఉత్తమ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.