తెలంగాణ
Uttam Kumar Reddy: SLBC ఘటనలో ఇప్పటి వరకు ఇద్దరి మృతదేహాలు గుర్తించాం

Uttam Kumar Reddy: SLBC ఘటనలో ఇప్పటి వరకు ఇద్దరి మృతదేహాలు గుర్తించామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. SLBC పనులు పూర్తి చేసేందుకే ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారాయన. అలాగే ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టుకు కట్టుబడి ఉన్నాం అన్నారు. తమ్మడి హట్టి వద్ద ప్రాజెక్టు పనులు త్వరలో ప్రారంభిస్తామన్నారు.
కాళేశ్వరం డీపీఆర్కు, నిర్మాణానికి తేడా ఉందన్న మంత్రి ఈ విషయంలో ఎన్డీఎస్ఏ రిపోర్టు కోసం చూస్తున్నామన్నారు. కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్ను కలిసి ఎన్డీఎస్ఏ రిపోర్టు ఇవ్వాలని కోరాం అన్నారు. కాళేశ్వరంపై జ్యుడిషియల్ విచారణ జరుగుతోందని ఉత్తమ్ వెల్లడించారు.