తెలంగాణ
Uttam Kumar Reddy: బనకచర్లపై బీఆర్ఎస్ నేతలవి పచ్చి అబద్ధాలు

Uttam Kumar Reddy: బనకచర్లతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ . GRMC, CWCఅపెక్స్ కౌన్సిల్ నిబంధనలకు బనకచర్ల విరుద్దమని ఎట్టి పరిస్థితుల్లో దీన్నితెలంగాణ అంగీకరించదన్నారాయన. దీనిపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ ద్వారా తెలిపామన్నారు. అలాగే మంత్రి సీఆర్ పాటిల్కు లేఖ రాసినట్టు ఉత్తమ్ వెల్లడించారు.
తమకు ఏపి నుండి ఎలాంటి ప్రతిపాదన రాలేదని వస్తే అన్ని నిబంధనలను పరిశీలిస్తామన్నారాయన. ఏపీ ఉల్లంఘనలను పూర్తిగా లేఖల్లో వివరించామన్నారు. బనకచర్లపై బీ బీఆరెఎస్ నేతలు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు ఉత్తమ్. తెలంగాణ నీటి హక్కుల పోరాటంలో వెనక్కి తగ్గేదిలేదన్నారు. కృష్ణాలో తెలంగాణకు అన్యాయం చేసింది బీఆర్ఎస్సేనని ఉత్తమ్ ఆరోపించారు.