JD Vance: భారత్కు చేరుకున్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్

JD Vance: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్కు చేరుకున్నారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీలోని పాలెం టెక్నికల్ ఏరియాలో దిగారు. ఆయన వెంట సతీమణి ఉషా వాన్స్ కూడా వచ్చారు. ఈ రోజు సాయంత్రం ప్రధాని మోదీతో జేడీ వాన్స్ భేటీ కానున్నారు. వాణిజ్యం, టారిఫ్, ప్రాంతీయ భద్రతతోపాటు పలు ద్వైపాక్షిక అంశాలపై వీరు చర్చలు జరపనున్నారు.
అమెరికా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జేడీ వాన్స్ భారత్ పర్యటనకు రావడం ఇదే తొలిసారి. ఆయన వెంట భార్య, ముగ్గురు పిల్లలతో పాటు ఉన్నతస్థాయి అమెరికా ప్రతినిధులు ఉన్నారు. వారిలో రక్షణ శాఖ, విదేశాంగశాఖ అధికారులు ఉన్నారు. వాన్స్కు మన సైనిక దళాలు గౌరవ వందనం చేశాయి. సాయంత్రం 6గంటల 30నిమిషాలకు వాన్స్ దంపతులకు లోక్కల్యాణ్ మార్గ్లోని తన నివాసంలో ప్రధాని మోదీ స్వాగతం పలుకుతారు. అనంతరం ఇరువురు నేతలు అధికారిక చర్చల్లో పాల్గొంటారు.