భారత్తో కాళ్ల బేరానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్

Trump: డొనాల్డ్ ట్రంప్… టెంపర్కు కేరాఫ్ అడ్రస్. పొరపాటున కూడా ట్రంప్ ఇగోను టచ్ చేయకూడదు. కాదని టచ్ చేస్తే.. తనలోని టెంపర్ వైఫైలా ఆన్ అవుతుంది. అవతలి వ్యక్తి ఎంత పవర్ఫుల్ లీడర్ అయినా ఏమాత్రం లెక్క చేయకుండా పవర్ పంచ్ విసిరూస్తారు. ఆయన అమెరికా అధ్యక్షుడి కంటే పక్కా బిజినెస్ మెన్గానే గుర్తింపు తెచ్చుకున్నారు. దేశాల మధ్య సంక్షోభాల్లోనూ డాలర్లు ఏరుకునే రకం. తనకు ఉపయోగం లేకపోతే అవతలి వారి నోటి కాడా కూడా కూడు లాగేసుకునే రకం.
అలాంటి వ్యక్తిని భారత్ కాళ్ల బేరానికి వచ్చేలా చేసింది. పహల్గాం దాడి తర్వాత పాక్పై భారత్ విరుచుకుపడిన తీరు అగ్రరాజ్యానే గడగడలాడింది. ట్రేడ్ వార్ తో పలు దేశాలను తన గుప్పిట్లో పెట్టుకోవాలని ట్రంప్ ప్లాన్ను మోదీ తిప్పికొట్టారు.
దీంతో అందరిని నెగ్గించుకోవాలనుకున్న ట్రంప్ భారత్ ను ఒప్పందం కోసం అడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. భారత్తో తర్వలో అగ్రరాజ్యం అతిపెద్ద ఒప్పందం చేసుకోనుంది. ఇంతకీ భారత్తో ట్రంప్ చేసుకోవాలనుకుంటున్న ఒప్పందం ఏంటి..? భారత్తో అమెరికా కాళ్ల బేరానికి ఎందుకు వచ్చింది…?
భారతదేశం-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం త్వరలోనే ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న సుంకాల ప్రతిష్టంభన నేపథ్యంలో చర్చలు ఊపందుకున్నాయి. రెండు దేశాలకూ ఆమోదయోగ్యమైన ఉమ్మడి ప్రయోజనాలపై ఏకాభిప్రాయం కుదిరినట్లు కనిపిస్తుంది. ఈ చర్చల్లో ప్రధానంగా పరస్పర మార్కెట్ల వినియోగం స్థానిక నిబంధనల అమలు, టారిఫ్ మినహాయింపులకు పరిమితులపై ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.
భారత్తో త్వరలో అతిపెద్ద ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. వైట్హౌస్లో బిగ్ బ్యూటిఫుల్ బిల్పై జరిగిన కార్యక్రమంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా చైనాతో వాణిజ్య ఒప్పందంపై సంతకాలు జరిగాయని తెలిపారు. ప్రతిఒక్కరూ తమతో ఒక ఒప్పందం కుదుర్చుకోవాలని దానిలో భాగం కావాలని కోరుకుంటున్నారన్నారు. ఈ సందర్భంగా చైనాతో వాణిజ్య ఒప్పందంపై సంతకం చేశామని చెప్పారు.
కొన్ని గొప్ప దేశాలతో ఒప్పందాలు కుదరనున్నాయన్నారు. బహుశా భారత్తో అతిపెద్ద ఒప్పందం జరగొచ్చని కూడా ట్రంప్ తెలిపారు. అయితే బీజింగ్తో జరిగిన ఒప్పందాలకు సంబంధించిన విషయాలను ఆయన వెల్లడించలేదు. ఇక ఈ సందర్భంగా తాము అన్ని దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవాలనుకోవడం లేదని ట్రంప్ స్పష్టం చేశారు.
కాగా ఏప్రిల్లో ట్రంప్ సర్కార్ పలు దేశాలపై టారిఫ్ల మోత మోగించింది. వాణిజ్య లోటుకు కారణమవుతున్నాయన్న ఆరోపణలతో భారత్ సహా పలు దేశాలపై ప్రతీకార సుంకాలను ప్రకటించారు. అనంతరం కొన్ని రోజుల పాటు ఈ సుంకాల అమలుకు అమెరికా విరామం ప్రకటించింది. చైనా మినహా ఇతర దేశాలపై ఈ సుంకాలను జూలై 8 వరకు 90 రోజుల పాటు నిలిపివేశారు. సుంకాల నేపథ్యంలో అగ్రరాజ్యంతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం చేసుకోవాలని భారత్ దృష్టిసారించింది.
ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం ఎప్పటినుంచో చర్చలు కొనసాగుతున్నాయి. ఇటీవల ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందానికి అడుగులు పడ్డాయి. అయితే ఈ ఒప్పందాల విషయంలో అమెరికా తీవ్ర జాప్యం చేసింది. భారత్ చెప్పినదానికి ఒప్పుకోవాలా అనేలా పోస్ కొట్టింది.
ఈ క్రమంలోనే కాశ్మీర్లోని పహల్గాంలో పాక్ ఉగ్రదాడికి దిగింది. అమాయకుల ప్రాణాలు పొట్టన పెట్టుకుంది. ఉగ్రదాడి 26 మంది అమాయకులు బలైయ్యారు. దీంతో భారత్ సిందూర్ పేరుతో పాక్ పై ఆపరేషన్ మొదలుపెట్టింది. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా తొమ్మిది ఉగ్ర స్థావరాలపై సైన్యం మెరుపుదాడి చేసింది. శత్రువు అప్రమత్తమయ్యేలోపే ఆట ముగించేసింది.
దీంతో వందలాది మంది ఉగ్రమూకల భరతం పట్టింది. పరిమితంగా, వ్యూహాత్మకంగా చేపట్టిన చర్యతోనే పాక్ సైన్యం బిత్తరపోయింది. భద్రతామండలిలో భారత్ను దెబ్బకొట్టాలని సెల్ఫ్ గోల్ చేసుకుంది. కానీ ఏ ఒక్క దేశమూ షరీఫ్ ప్రభుత్వానికి అండగా నిలవలేదు.
ఈ యుద్ధంతో అమెరికాకి దిమ్మతిరిగి బొమ్మకనిపిచింది. భారత్ సత్తా అర్థమైంది. భారత్ తో పెట్టుకుంటే ఏడు సముద్రాల నీరు తాగిస్తుందని క్లారిటి వచ్చింది. దీంతో అమెరికా అధ్యక్షుడు దిగొచ్చాడు. భారత్తో కయ్యానికంటే వియ్యమే మంచిదని అభిప్రాయ పడ్డారు. ఇంతవరకు భారత్ వాణిజ్య ఒప్పందంపై మాట్లాడుతున్నా పట్టించుకోని అమెరికా ఇప్పుడు అదే కాళ్ల బేరానికి వచ్చింది. చర్చలకు తాము సిద్ధమని, వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవాలని సూచించింది.
ఈ క్రమంలో భారత్ వేగంగా చర్చలు చేపడుతోంది. వాణిజ్య ఒప్పందం చేసుకుందామంటూ అడుకుంట్టోంది. ఈ నేపథ్యంలోనే పరస్పర ప్రయోజనాలకు అనుగుణంగా ఒప్పందం చేసుకునేలా దేశాధినేతలు అంగీకారం తెలిపారు. తమ వస్తువులపై అమెరికా విధించిన 26 శాతం అదనపు సుంకం నుంచి భారత్ పూర్తి మినహాయింపు కోరుతోంది. ఈ నేపథ్యంలో జూలై 8 లోపు మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసుకునేందుకు ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయని వార్తలు బయటకు వచ్చాయి.
ఇక.. ఈ ఒప్పందంలో భారత్ కొన్ని కీలక రంగాల్లో సుంకాల నుంచి సడలింపు కోరుతోంది. ఇందులో టెక్స్టైల్స్, రత్నాలు, ఆభరణాలు, దుస్తులు, ప్లాస్టిక్స్, రసాయనాలు, రొయ్యలు, నూనె గింజలు, రసాయనాలు, ద్రాక్ష, అరటిపండ్లు వంటివి ఉన్నాయి. మరోవైపు అమెరికా కొన్ని పారిశ్రామిక వస్తువులు, ఆటోమొబైల్స్ , వైన్స్, పెట్రోకెమికల్ ఉత్పత్తులు, పాడి ఉత్పత్తులు రంగాల్లో సుంకాల సడలింపు కోరుతోంది. ఈ ఒప్పందం కోసం రెండు దేశాలు నిబంధనల్ని ఖరారు చేశాయి. ఇందులో సుంకాలు, వస్తువులు, సేవలు, సుంకేతర అడ్డంకులు, కస్టమ్స్ వంటి అంశాలు ఉన్నాయి.
ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు ఏప్రిల్ 2న భారత ఉత్పత్తులపై అమెరికా అదనంగా 26 శాతం మేర టారిఫ్స్ ప్రకటించింది. అయితే జులై 9వ తేదీ వరకు అంటే 90 రోజుల పాటు ఈ సుంకాల అమలును వాయిదా వేసింది. ఈ 90 రోజల వ్యవధిని ఉపయోగించుకొని చర్చలను ముందుకు తీసుకెళ్లాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి. ఇక 10 శాతం బేస్లైన్ సుంకం యథాతథంగా కొనసాగుతుంది. విస్తృతమైన వాణిజ్య లోటును తగ్గించేందుకు టారిఫ్ చర్యలు తీసుకున్నట్లు అమెరికా ప్రకటించింది.
దేశీయ ఉత్పత్తులపై ప్రకటించిన 26 శాతం టారిఫ్ నుంచి పూర్తి మినహాయింపు ఇవ్వాలని, వాణిజ్య చర్చల్లో భాగంగా అమెరికాను కోరుతోంది. ఆ 26 శాతం సుంకాలు విధించకుండా మినహాయించాలని వాణిజ్య చర్చల్లో ప్రధాన డిమాండ్ వినిపిస్తున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. జులై 8, 2025 లోపు ఇరు దేశాలు ఒక మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు చెప్పారు.
ఈ క్రమంలోనే కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్తో సమావేశమై చర్చలు జరిపారు. పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన మార్కెట్ సౌకర్యం కల్పించడం, సుంకాల తగ్గింపు, ఇతర అంశాలపై కీలక చర్చ జరిగింది. ఈ ఏడాది సెప్టెంబరు-అక్టోబరు నాటికి తొలి దశ ఒప్పందాన్ని ఖరారు చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. ఈ విషయంపై గతంలో భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయాల్ స్పందించారు.
భారత్, అమెరికా పరస్పరం ఒకరి వ్యాపారాలకు మరొకరు ప్రాధాన్యంతో కూడిన మార్కెట్ ప్రవేశం కల్పించాలని కోరుకుంటున్నాయని ఇరు దేశాల బృందాలు ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. వాణిజ్య చర్చలకు మరింత ఊతమిచ్చేందుకు వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ కూడా ఇటీవల వాషింగ్టన్లో పర్యటించారు. ఇక ప్రస్తుతం 190 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్యాన్ని 2030 నాటికి 500 బిలియన్ డాలర్ల స్థాయికి చేర్చడమే ఈ చర్చల ప్రధాన ఉద్దేశమని సమాచారం.
ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు అనేది పాత మాట. కానీ, ట్రంప్ లెక్కలో మాత్రం నెగ్గాలంటే తగ్గడం కాదు తొక్కుకుంటూ వెళ్లిపోవడమే. ఈ దూకుడే ఆయన్ను రెండోసారి అమెరికా అధ్యక్షుడిని చేశాయి. కానీ, ఇప్పుడు ట్రంప్ దూకుడు తగ్గించాడు. అందరిని వ్యతిరేకిస్తూ అవసరాలకు వాడుకుంటే అసలుకే ఎసరు వస్తుందని గ్రహించాడు. దీంతో అందరితో కలిసి నడవాలని డిసైడ్ అయ్యాడట మరి ట్రంప్ ఆడుతున్న ఈ కొత్త నాటకం ఎంత వరకు వెళ్తుందో చూడాలి.