ఆంధ్ర ప్రదేశ్

Visakha: కేంద్రమంత్రులకు తప్పిన ప్రమాదం

Visakha: విశాఖపట్నంలో కేంద్రమంత్రులకు పెను ప్రమాదం తప్పింది. షీలానగర్ వద్ద కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ప్రమాదంలో మూడు వాహనాలు ధ్వంసం కాగా… కేంద్ర మంత్రులు సురక్షితంగా బయటపడ్డారు. మొదట విశాఖ చేరుకున్న కేంద్ర ఉక్కు మంత్రులు కుమార స్వామి, శ్రీనివాస్ వర్మకు ఎయిర్‌పోర్ట్‌లో స్వాగతం పలికారు ఎంపీలు భరత్, అప్పల నాయుడు, బీజేపీ నేతలు.

ఉక్కు పరిశ్రమకు 11వేల 440 కోట్ల కేంద్ర ప్యాకేజీ ప్రకటించిన తర్వాత తొలిసారి కేంద్ర ఉక్కుశాఖ మంత్రి రావడంతో వెల్‌కమ్‌ చెప్పారు.. అయితే.. ఎయిర్‌పోర్ట్‌ నుంచి స్టీల్‌ ప్లాంట్‌కు వెళ్తున్న సమయంలో షీలా నగర్ వద్ద కాన్వాయ్‌లోని మూడు వాహనాలు ఒకదానితో మరొకటి ఢీకొన్నాయి.. ఎనిమిది వాహనాల కాన్వాయ్‌లో మూడు కార్లు ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది.. ఇక ధ్వంసమైన కారులో మాజీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు కారు కూడా ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button