ఆంధ్ర ప్రదేశ్
గుంటూరు నగర అభివృద్ధిపై కేంద్రమంత్రి పెమ్మసాని సమీక్ష

గుంటూరు నగర అభివృద్ధిపై కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ నాగలక్ష్మీ, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, రామాంజనేయులు, ససీర్ అహ్మద్, ఎమ్మెల్సీ ఏసురత్నం పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు నగరం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను 90శాతం నెరవేర్చామని తెలిపారు.