అంతర్జాతీయం

రష్యా అధ్యక్షుడు పుతిన్ హెలికాప్టర్‌పై ఉక్రెయిన్ డ్రోన్ దాడి

కుక్కతోక ఎప్పుడూ వంకరే అన్నట్లు ఉంది రష్యా, ఉక్రెయిన్ తీరు. ఎంతమంది, ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోవడం లేదు. మూడేళ్లుగా ఇరు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. అమెరికా మధ్యవర్తిత్వం చేస్తున్నా మరోవైపు మంతనాలు జరుగుతున్నా మళ్లీ వార్ మొదలుపెట్టారు ఆ ప్రబుద్ధులు. ఈ ఘటనలో పుతిన్ అతి పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఇంతకీ పుతిన్ పై దాడి చేసింది ఎవరు..? మళ్లీ యుద్ధం ఎందుకు మొదలైంది..? దీనిపై అమెరికా అధ్యక్షుడు ఏం అంటున్నాడు.?

ఉక్రెయిన్, రష్యా మధ్య పరిస్థితులు రోజురోజుకూ మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఉక్రెయిన్పై రష్యా డ్రోన్లు, మిసైళ్లతో విరుచుకుపడుతుంటే బదులుగా ఉక్రెయిన్ కూడా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ టార్గెట్ గా డ్రోన్ దాడికి యత్నించినట్లు తెలిసింది. ఈ దాడి నుంచి పుతిన్ తృటిలో తప్పించుకున్నారని రష్యా మిలటరీ కమాండర్ చెప్పారు.

కురుస్క్‌లో దాడి జరగ్గా.. 46 డ్రోన్లను రష్యా సైన్యం నాశనం చేసింది. అయితే అదే తేదీన పుతిన్‌ ఆ ప్రాంతంలో పర్యటించారు. ఆయన హెలికాఫ్టర్‌ ప్రయాణిస్తున్న మార్గంలోకి హఠాత్తుగా డ్రోన్లు దూసుకొచ్చాయి. అయితే సకాలంలో వాటిని వైమానిక బలగాలు నేలకూల్చాయి. ఈ సంఘటనలో ఎటువంటి గాయాలు లేదా నష్టం జరగలేదు. రష్యా అధ్యక్షుడి కాన్వాయ్ అంతరాయం లేకుండా కొనసాగింది. ఆపై అధ్యక్షుడి ప్రయాణం కొనసాగింది. ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరుగుతోందని రష్యా తెలిపింది. అయితే.. ఈ ప్రకటనపై ఉక్రెయిన్‌ నుంచి ఎలాంటి స్పందన లేదు.

మరోవైపు.. కౌంటర్‌గా రష్యా ఉక్రెయిన్‌పై ప్రతిదాడికి దిగింది. రాజధాని కీవ్‌ నగరంతో పాటు పలు చోట్ల డ్రోన్లు, మిస్సైల్స్‌తో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 12 మంది చనిపోయారు. పదుల సంఖ్యలో పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. 80 నివాస భవనాలు సైతం ధ్వంసమయ్యాయి. దాదాపు 27 చోట్ల అగ్ని ప్రమాదాలు సంభవించాయి. ఇరాన్ రూపొందించిన షాహెద్ డ్రోన్లను ఉక్రెయిన్‌పై రష్యా ప్రయోగించింది. రష్యా దాడులకు భయపడి వందలాది ఉక్రెయిన్‌ పౌరులు అండర్‌గ్రౌండ్‌ మెట్రో స్టేషన్లలోకి వెళ్లి తలదాచుకున్నారు. ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితుల్లో అక్కడే నిద్రించారు.

2022 ఫిబ్రవరిలోరెండు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యా ఈ స్థాయిలో ఎయిర్ స్ట్రయిక్స్ చేయడం ఇదే మొదటిసారి. 367 డ్రోన్లు.. మిసైళ్లతో రష్యా దాడి చేసింది. రష్యా మొత్తంగా 69 మిసైల్స్, 298 డ్రోన్లు వాడిందని ఉక్రెయిన్ వెల్లడించారు. సాధారణ నగరాలపై శత్రు దేశం కనికరం లేకుండా దాడి చేసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్ స్కీ మండిపడ్డారు. అయితే.. రష్యా దాడులపై అమెరికా సహా అంతర్జాతీయ సమాజం మౌనంగా ఉండడం ఏమాత్రం సరికాదని, ఇది పుతిన్‌ను మరింత రెచ్చిపోయేలా చేస్తుందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లోదిమిర్‌ జెలెన్‌స్కీ అన్నారు.

ఇదిలా ఉంటే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఉక్రెయిన్‌ ప్రత్యేక రాయబారి కీత్‌ కెల్లోగ్‌ రష్యా దాడులను తీవ్రంగా ఖండించారు. తాను అధికారంలోకి వస్తే ఉక్రెయిన్‌, రష్యా మధ్య యుద్ధం ఆపేస్తానంటూ ఎన్నికల సమయంలో డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. హామీ ఇచ్చినట్టుగానే ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం దిశగా శాంతి చర్చలు సాగుతోన్న వేళ ఉక్రెయిన్‌పై రష్యా భారీ వైమానిక దాడికి తెగబడింది.

దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరుకున్నాయి. తాజా పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. పుతిన్ పిచ్చివాడిలా ప్రవర్తిస్తున్నాడని, ఉక్రెయిన్‌ను ఆక్రమిస్తే రష్యా పతనమవుతుందని హెచ్చరించారు. శాంతి చర్చల సమయంలో రష్యా వైఖరిపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.

ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీపై కూడా ట్రంప్ విమర్శలు గుప్పించారు. అతడు మట్లాడే విధానమే సమస్యలకు కారణమవుతోందని, అది తనకు నచ్చడం లేదని ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను అధ్యక్షుడిగా ఉండుంటే ఈ యుద్ధం మొదలయ్యే అవకాశం లేదని ఎన్నిసార్లు చెప్పానో! ఇది జెలెన్‌స్కీ పుతిన్, బైడెన్‌ల యుద్ధం ట్రంప్‌ది కాదు. తాను చేసే పని ఈ పెద్ద ప్రమాదాన్ని ఆపడమేనని స్పష్టం చేశారు. అసమర్థత, ద్వేషం వల్ల ఇది జరిగిందని తాను చెప్పింది నిజమని పేర్కొన్నారు.

జెలెన్‌స్కీ మాట్లాడుతున్న తీరు సరిగా లేదని విమర్శించారు. ఉక్రెయిన్‌ను పూర్తిగా ఆక్రమించాలనుకుంటే అది రష్యా పతనానికి దారితీస్తుందని అమెరికా అధ్యక్షుడు హెచ్చరించారు. రష్యా దాడుల నేపథ్యంలో మరిన్ని ఆంక్షలు విధించే అవకాశం ఉందని ట్రంప్ తెలిపారు. గతంలో పుతిన్‌పై పట్ల సానుకూలంగా ఉన్నప్పటికీ.. ఇటీవల జరుపుతోన్న శాంతి చర్చల్లో కీవ్‌తో మాస్కో అనుసరిస్తున్న వైఖరిపై ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు.

రష్యా-ఉక్రెయిన్‌లు వందల సంఖ్యలో ఖైదీలను పరస్పర మార్పిడి జరిగిన తర్వాత.. మాస్కో మళ్లీ తీవ్ర వైమానిక దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో ఇద్దరు చిన్నారులు, యువకుడు సహా పలు ప్రాంతాల్లో పౌరులు ప్రాణాలు కోల్పోయారు. రష్యా నాయకత్వంపై గట్టి ఒత్తిడి లేకుండా ఈ మానవహననం ఆగదని రష్యా చర్యలపై జెలెన్‌స్కీ అన్నారు.

కాగా.. డ్రోన్ల దాడి స‌య‌మంలో త‌మ వైమానిక ర‌క్ష‌ణ ద‌ళాలు యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ కంబాట్ విన్యాసాలు నిర్వ‌హించిన‌ట్లు చెప్పారు. ప్రెసిడెంట్ హెలికాప్ట‌ర్ క్షేమంగా ఉండేలా చ‌ర్య‌లు తీసుకున్నామ‌న్నారు. శ‌త్రు డ్రోన్ల‌ను తిప్పికొట్టామ‌ని, ఏరియ‌ల్ టార్గెట్ల‌ను పేల్చివేసిన‌ట్లు దాస్కిన్ తెలిపారు. సుమారు 764 ఉక్రెయిన్ డ్రోన్ల‌ను నేల‌కూల్చిన‌ట్లు ర‌ష్యా పేర్కొన్న‌ది. వంద‌ల సంఖ్య‌లో మాన‌వ‌ర‌హిత వైమానిక వాహ‌నాల‌ను ధ్వంసం చేసిన‌ట్లు చెప్పారు. యూకే, ఫ్రాన్స్, జ‌ర్మ‌నీ, ఈయూ దేశాల స‌హ‌కారంతో ర‌ష్యాపై దాడుల‌కు ఉక్రెయిన్ తెగిస్తున్న‌ట్లు విదేశాంగ మంత్రి తెలిపారు.

మరోవైపు ఉక్రెయిన్‌ ప్రయోగించిన 110 డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా ప్రకటించింది. 12 ప్రాంతాల్లో ఉక్రెయిన్‌ దాడులు చేసినట్లు తెలిపింది. అయితే ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని వెల్లడించింది. 2022 ఫిబ్రవరిలో రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం మొదలుకాగా ఇప్పటివరకు 20 శాతం ఉక్రెయిన్‌ భూభాగాన్ని రష్యా ఆక్రమించింది. గత 3 రోజుల్లో రష్యా- ఉక్రెయిన్‌ పరస్పరం వెయ్యి మంది ఖైదీలను మార్పిడి చేసుకున్నాయి. ఇటీవల జరిగిన ప్రత్యక్ష చర్చల్లో ఈ మేరకు ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరింది.

కాగా రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత రష్యా భూభాగంలోకి తొలిసారిగా విదేశీ సైనిక దాడి జరిగిన సందర్భంగా, ఉక్రెయిన్ ఆగస్టు 2024లో కుర్స్క్ ఒబ్లాస్ట్‌లోకి సరిహద్దు చొరబాటును ప్రారంభించింది. అప్పటి నుండి, ఉక్రేనియన్ దళాలు ఈ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలపై పట్టును కొనసాగించాయి. అయితే, మార్చి 25న, రష్యా ఉత్తర కొరియా దళాల సహాయంతో పెద్ద ఎత్తున ఎదురుదాడిని ప్రారంభించి, వారిని వెనక్కి తరిమికొట్టింది.

అయితే ఈ సంఘటన ఉక్రేనియన్ డ్రోన్ సామర్థ్యాల గురించి ఆందోళనలను రేకెత్తించింది, ఈ దాడి హత్యాయత్నమా లేదా కైవ్ చేసిన విస్తృత మానసిక చర్యనా అని రష్యన్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button