తెలంగాణ
Hyderabad: అడిక్మెట్ బ్రిడ్జ్పై రోడ్డుప్రమాదం.. ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్ధులు మృతి

Hyderabad: హైదరాబాద్ అడిక్మెట్ బ్రిడ్జ్పై రోడ్డుప్రమాదం జరిగింది. బైక్ అదుపు తప్పి ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్ధులు మృతి చెందారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతులు రోహిత్, రాజ్కుమార్గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.