తెలంగాణ
Thatipalli: విషాదం.. నీటికుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి

Thatipalli: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తాటిపల్లిలో విషాదం నెలకొంది. నీటి కుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. గ్రామ సమీపంలో సరదాగా ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఇద్దరు చిన్నారులు వ్యవసాయ కుంటలో పడి చనిపోయారు. పిల్లల దగ్గర కూర్చుని తల్లిదండ్రులు ఏడుస్తున్న ఘటన అందరినీ కంటతడి పెట్టించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.