తెలంగాణ
అల్వాల్ లో బాలికల మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. ఓయో రూంలో బాలికలు

అల్వాల్లో బాలికల మిస్సింగ్ కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇద్దరు బాలికలను ఇన్స్టాగ్రామ్లో పరిచయం చేసుకున్న యువకులు వారిని మాయమాటలతో మభ్యపెట్టి అత్యాచారానికి పాల్పడ్డారు. ఓయో రూంకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. యువకులు దమ్మాయిగూడెంకి చెందిన ఆకుల సాత్విక్, ఈసీఐఎల్కి చెందిన కర్నాటి మోహన్ చంద్.
5 నెలలుగా బాలికలతో చాటింగ్ చేసి పరిచయం పెంచుకున్నారు. ఈ క్రమంలోనే ఇంట్లో నుంచి వెళ్లిన బాలికలను తల్లిదండ్రుల ఫిర్యాదుతో రెస్క్యూ చేసి గుర్తించారు పోలీసులు. యువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లాడ్జి నిర్వాహకుడిపైనా కేసు నమోదు చేశారు పోలీసులు.