Turkey: భారత్పై మరోసారి విషం కక్కిన టర్కీ

Turkey: భారతదేశంపై టర్కీ మరోసారి విషం కక్కింది. భారత వ్యతిరేక కార్యకలాపాల కోసం పాకిస్థాన్కు టర్కీ డ్రోన్లను సరఫరా చేయడమే కాకుండా, తమ సైనిక సిబ్బందిని కూడా పంపింది. ముఖ్యంగా, ఆపరేషన్ సిందూర్’ పేరిట జరిగిన ఘటనల్లో టర్కీకి చెందిన సైనికులు పాల్గొన్నట్లు సమాచారం. ఇటీవల కాలంలో పాకిస్థాన్, టర్కీల మధ్య రక్షణ ఒప్పందాలు ఊపందుకున్నాయి.
భారత్పై దాడులే లక్ష్యంగా పాకిస్థాన్కు టర్కీ వందల సంఖ్యలో అత్యాధునిక డ్రోన్లను అందించింది. ఈ డ్రోన్ల వినియోగంపై పాక్ సైనికులకు శిక్షణ ఇచ్చేందుకు టర్కీ సైనిక నిపుణులను ఇస్లామాబాద్కు పంపినట్లు వార్తలు తెలుస్తోంది.
ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ జరిపిన ప్రతిదాడుల్లో ఇద్దరు టర్కీ సైనికులు మరణించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ఆపరేషన్ అనంతరం పాకిస్థాన్ సుమారు 300 నుంచి 400 డ్రోన్లను భారత భూభాగంపైకి ప్రయోగించగా, వాటిని భారత బలగాలు సమర్థవంతంగా కూల్చివేశాయి. ఈ డ్రోన్ల శకలాలను ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించగా, అవన్నీ టర్కీకి చెందినవిగా గుర్తించారు.
పహల్గామ్ ఉగ్రదాడి ఘటనను ప్రపంచ దేశాలు ఖండించినప్పటికీ, ఎర్డోగాన్ మాత్రం పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ను కలిసి సంఘీభావం తెలిపారు. పహల్గామ్ దాడి అనంతరం ముస్లిం దేశాల్లో పాకిస్థాన్కు మద్దతుగా నిలిచినవి టర్కీ, అజర్బైజాన్ మాత్రమే కావడం ఈ వాదనలకు బలం చేకూరుస్తోంది.