తెలంగాణ
Tummala: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లిలో తుమ్మల పర్యటన

Tummala: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. మాదారం గ్రామంలోని సీతారామ ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం ప్రధాన కాలువపై 2019లో నిర్మించిన పిల్లర్ ఒకటి ఇటీవల కూలిపోయింది. కూలిన పిల్లర్ ను వెంటనే నిర్మించాలని, ప్రాజెక్ట్ లో భాగంగా చేపట్టే పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారులను ఆదేశించారు.