ఆంధ్ర ప్రదేశ్
మహా కుంభమేళాలో టీటీడీ ఉద్యోగి అదృశ్యం

Maha Kumbh Mela: మహా కుంబమేళాలో టీటీడీ ఉద్యోగి మిస్సింగ్ కలకలం రేపుతోంది. ప్రయాగ్రాజ్లో టీటీడీ నమూనా ఆలయంలో.. విధులు నిర్వహించేందుకు డిప్యూటేషన్పై వెళ్లారు ఉద్యోగి సుబ్రహ్మణ్యం. అయితే.. నిన్న సాయంత్రం షాపింగ్కు వెళ్లిన సుబ్రహ్మణ్యం కనబడకుండా పోయారు.
దీనిపై.. దారాగంజ్ పీఎస్లో అధికారులు ఫిర్యాదు చేశారు. ఉద్యోగి కోసం గాలింపు కొనసాగుతోంది. మరోవైపు.. ఉద్యోగి మిస్సింగ్పై కుటుంబసభ్యులు, టీటీడీ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.