ప్రియుడి ఇంటి ముందు ట్రాన్స్జెండర్ ధర్నా

Kurnool: తనను ప్రేమించి..పెళ్లి చేసుకొని మోసం చేశాడంటూ కర్నూల్ జిల్లా బైచిగిరి గ్రామానికి చెందిన యువకుడి ఇంటి ఎదుట ఓ ట్రాన్స్జెండర్ ఆందోళనకు దిగింది. నాలుగేళ్ల క్రితం ఆదోని మండలం బైచిగిరికి చెందిన గణేష్ అనే యువకుడు ఉద్యోగరీత్యా హైదరాబాద్కు వెళ్లాడు.
హాసినిగౌడ్ అనే ట్రాన్స్జెండర్తో పరిచయం కాస్తా ప్రేమగా మారింది. తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. గతేడాది గణేష్కు పెళ్లి కుదరడంతో ట్రాన్స్జెండర్ హాసినిని వదిలేసి సొంత గ్రామానికి వచ్చి మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఇంటి నుంచి 5 లక్షలు తీసుకెళ్లి ఇద్దరం పెళ్లి చేసుకుని హైదరాబాద్లో నివాసముంటున్నామని హాసినిగౌడ్ వాపోయింది.
తన డబ్బులు రూ.5 లక్షలు అయినా ఇప్పించాలని, లేకపోతే గణేష్తో కాపురం అయినా చేయించాలని డిమాండ్ చేసింది. సమాచారం అందుకున్న తాలూకా ఎస్ఐ రామాంజనేయులు గ్రామానికి చేరుకుని విచారించారు. హాసినిగౌడ్ గణేష్పై ఇదివరకే కేసు హైదరాబాద్లో నమోదయ్యిందని, ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి న్యాయం చేస్తామని ఎస్ఐ చెప్పడంతో వారు హాసినిగౌడ్, ఇతర ట్రాన్స్జెండర్లు ధర్నా విరమించారు.