ఆంధ్ర ప్రదేశ్
Tirupati: హోటల్ గదిలో కూలిన పైకప్పు

Tirupati: మినర్వా హోటల్ గది పైకప్పు కూలిన ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది. రూమ్ నెంబర్ 314లో ఘటన జరిగింది. ప్రమాదంలో ఇద్దరు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనతో శ్రీవారి భక్తులు అప్రమత్తమయ్యారు.
అంతేకాదు మినర్వా హోటల్లోని గదులను ఒక్కసారిగా భక్తులు వెకెట్ చేశారు. ఘటనకు యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమంటున్నారు భక్తులు. తమ ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారంటున్న శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.