తెలంగాణ
Bhupalpally: మహదేవపూర్ అడవుల్లో పెద్దపులి సంచారం.. పాదముద్రలు గుర్తింపు

Bhupalpally: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో పెద్దపులి సంచారం కలవర పెడుతోంది. పల్గుల గ్రామ శివారు అడవిలో పులి పాదముద్రలు,సేదతీరినా ఆనవాళ్లను స్థానికులు గుర్తించారు. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.
గత 25 రోజులుగా మహదేవపూర్, కాటారం రేంజ్ పరిధిలోని అడవుల్లో పులి కలియ తిరుగుతోంది. ఒక చోట నుండి మరో చోటుకు తన ఆవసాన్ని మార్చుతోంది పులి. గోదావరి దాటి మంచిర్యాల జిల్లాలోకి వెళ్లేందుకు మళ్లీ పులి వచ్చినట్లు ఫారెస్ట్ అధికారులు అనుమానిస్తున్నారు.



