తెలంగాణ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పులి కలకలం.. భయాందోళనలో గ్రామస్తులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పులి కలకలం రేపుతోంది. పినపాక మండలం పోట్లపల్లి అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. పోట్లపల్లి గ్రామంలో పులి పాద ముద్రలను గుర్తించారు ఫారెస్ట్ అధికారులు.

మంగపేట, తాడ్వాయి, ఆళ్లపల్లి, కరకగూడెం అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తునట్లు గుర్తించారు. దీంతో గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అడవిలోకి వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ఐదు రోజుల క్రితం పులి సంచరించినట్లు అడవిలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button