తెలంగాణ

సికింద్రాబాద్ ఆర్మీ కాలేజీలో దుండగుల చొరబాటు

దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్ అన్నారు పెద్దలు అలాంటి దేశాన్ని రక్షించడానికి మేమున్నామంటూ ముందుకు వస్తారు ఆర్మీ అధికారులు. దేశం కోసం పోరాడే ధైర్యాన్ని గుండెల నిండా నింపుకుని ఆర్మీలోకి చేరేందుకు సిద్ధమవుతారు. అది కఠోరమైన నిర్ణయమని తెలిసినా దేశ రక్షణకే మొగ్గు చూపుతారు.

అయితే తాజాగా సికింద్రాబాద్‌లో జరిగిన ఓ ఘటన దేశ రక్షణను ప్రమాదంలో పడేలా చేసింది. ఆర్మీ ఇంజనీరింగ్ కాలేజీలో నలుగురు ఆగంతకులు చొరబడ్డారు. ఫోటోలు, వీడియోలు తీశారు. దీంతో… అనుమానం వచ్చిన సెక్యూరిటీ అధికారులు వాళ్లను పట్టుకున్నారు. ఇంతకీ ఆర్మీ కాలేజీలో చొరబడ్డ ఆ నలుగురు ఏవరు..? వాళ్లకు ఉగ్ర కుట్రకు ఏమైనా సంబంధం ఉందా..? అసలు వాళ్ల ప్లాన్ ఏంటి..?

సికింద్రాబాద్ మిలిటరీ ఆర్మీ ఇంజినీరింగ్ కాలేజీలో నకిలీ ఆర్మీ గుర్తింపు కార్డుతో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడటం కలకలం రేపుతోంది. క్యాంటీన్ వద్ద ఫోటోలు తీస్తుండగా ఆర్మీ సిబ్బంది దుండగులను ప్రశ్నించారు. దీంతో అసలు విషయం బయటపడింది.

యువకుల వద్ద ఉన్న గుర్తింపు కార్డులను పరిశీలించగా అవి నకిలీవని నిర్ధారణ అయింది. దీంతో పోలీసులకు అప్పగించారు. అనుమానితులను దర్యాప్తు కోసం తిరుమలగిరి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

సికింద్రాబాద్‌ తిరుమలగిరి ఆర్మీకి చెందిన స్థలంలో అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. వారి వద్ద నకిలీ గుర్తింపుకార్డులు, సెల్‌ఫోన్లలో చిత్రీకరించిన సైనిక ప్రదేశాల వీడియోలు బయటపడ్డాయి.

ఇదే ప్రాంతానికి సమీపంలో ఉగ్రవాదులతో సంబంధాలున్న యువకుడిని అరెస్ట్‌ చేశారు. ముగ్గురిని వేర్వేరు కోణాల్లో ప్రశ్నించారు. ఉగ్రవాదులతో ఏమైనా సంబంధాలున్నాయా.. అనే దానిపై ఆరా తీయటంతో విషయం వెలుగులోకి వచ్చింది.

బిహార్‌కు చెందిన రాకేశ్‌కుమార్‌ హైదరాబాద్‌లో ప్రైవేటు సెక్యూరిటీ గార్డుగా చేస్తున్నాడు. సొంత రాష్ట్రంలో ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌నంటూ బురిడీ కొట్టించి యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఇతడి నిజస్వరూపం తెలిసి భార్య విడిపోయింది. జనవరిలో ప్రైవేటు సెక్యూరిటీ గార్డుగా చేసేందుకు నగరం చేరాడు. ఇతడి మామ బిహార్‌లో ఎయిర్‌ఫోర్స్‌ విభాగంలో పనిచేసేవాడు.

అక్కడ ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో కొందరు ఉద్యోగం చేస్తున్నట్టు తెలుసుకున్నాడు. ఇక్కడికి వచ్చాక తిరుమలగిరి ప్రాంతంలో సైనికుల నివాసాలను గుర్తించాడు. ఆర్మీ క్యాంటీన్‌లో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ బిహార్‌లోని 20 మంది మహిళల నుంచి డబ్బు వసూలు చేశాడు. వారిలో ఇద్దరిని ఆర్మీ క్యాంటీన్‌ చూసేందుకు నగరానికి రప్పించాడు.

తిరుమలగిరిలోని కాలేజ్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ కళాశాల గేటు ద్వారం అనుమతి లేకుండా సైనిక ప్రదేశంలోని క్యాంటీన్‌కు తీసుకెళ్లాడు. ఎయిర్ ఫోర్స్ టీ షర్ట్స్ ధరించి వింగ్ కమాండర్ రజత్ కుమార్ మిశ్రా పేరు ఉన్న ఐడీతో సికింద్రాబాద్ మిలిటరీ కాలేజీలోకి దూరారు ఆగంతకులు. క్యాంటీన్, ఆర్మీ రహస్య ప్రాంతాల వద్ద ఫోటో లు, వీడియోలు తీస్తుండగా భద్రతా సిబ్బంది దుండగులను అడ్డుకున్నారు.

వారి వద్ద ఉన్న గుర్తింపు కార్డుల ను పరిశీలించగా అవి నకిలీవని ని ర్ధారణ అయింది. అనుమానాస్పదంగా కనిపించిన ఈ ముగ్గుర్ని భద్రతా సిబ్బంది ప్రశ్నించారు. పొంతనలేని సమాధానం రావటంతో లెఫ్టినెంట్‌ కల్నల్‌ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను తిరుమలగిరి ఠాణాలో అప్పగించారు.

ఇద్దరు అమ్మాయిలకు జాబ్ ఇప్పిస్తానని నమ్మబలికాడు ఓ యువకుడు. ఈ క్రమంలోనే తాను నేవీ అధికారినని నమ్మించేందుకు తన ముఠాతో కలిసి నకిలీ ఐడీ కార్డులతో మిలిటరీ కాలేజీలోకి ప్రవేశించాడు. ఎయిర్ ఫోర్స్ డ్రెస్ ధరించి ఉండటంతో గేటు దగ్గర ఉన్న సిబ్బంది కూడా వాళ్లని ఆపలేదు.

అలా కాలేజీ ప్రాంగణంలోకి ప్రవేశించిన దుండగులు మిలటరీ క్యాంటీన్ వద్ద వీడియోలు తీయడం మొదలుపెట్టారు. ఇది గమనించిన భద్రతా సిబ్బంది అనుమానం రావడంతో వారిని ప్రశ్నించారు. గుర్తింపు కార్డులు చెక్ చేయగా అవి నకిలీవని తేలింది.

అయితే, నలుగురు నిందితులు ఆర్మీ రహస్య ప్రాంతా లను చిత్రీకరించడంతో మరేదో కా రణం కూడా ఉండి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా విచారణ జరుపుతున్నారు. దేశభద్రతకు సంబంధించిన విషయం కావటంతో కేంద్ర నిఘా, దర్యాప్తు సంస్థలు పట్టుబడిన ముగ్గురి నుంచి పూర్తి వివరాలు రాబట్టారు. అనుమతి లేకుండా సైనిక ప్రాంతంలోకి వెళ్లటంపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.

ఈ ఘటనతో దేశంలో ప్రముఖ సైనిక స్థావరాల్లో భద్రతా ప్రోటోకాల్‌ల పటిష్టతపై ఆందోళన రేకెత్తించింది. వ్యక్తులు సౌకర్యం యొక్క చుట్టుకొలతను ఎలా ఉల్లంఘించగలిగారు, వారి అనధికార ప్రవేశం సమయంలో ఏదైనా సున్నితమైన సమాచారం రాజీపడిందా అనే దానిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది.

చొరబాటు వెనుక ఉన్న కారణాలను వెలికితీయడమే వారి లక్ష్యం. భద్రతా ఉల్లంఘనకు ప్రతిస్పందనగా, భవిష్యత్తులో సంఘటనలు జరగకుండా నిరోధించడానికి MCEME క్యాంపస్‌లో అదనపు చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు.

ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఆశచూపి నిరుద్యోగుల నుంచి డబ్బు గుంజుతూ మోసాలకు పాల్పడే మాయగాళ్ల ఆగడాలు నానాటికీ పెరిగిపోతుంది. నకిలీ వీసాలు, జాబ్ ఆఫర్ లెటర్లు ఇచ్చి అమాయకులను నట్టేట ముంచుతున్నారు కేటుగాళ్లు. ఏకంగా ఆర్మీ కాలేజీలోకి నకిలీ ఐడీ కార్డులతో ఎంటర్ అయ్యారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు మరీ దేశ రక్షణకు మొదటి ప్రాధాన్యత ఇచ్చే ప్రధాని మోదీ ఈ విషయంపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button