తెలంగాణ
కర్రెగుట్టలో మందుపాతర పేలి ముగ్గురు గ్రేహౌండ్స్ జవాన్లు మృతి

Karregutta: తెలంగాణ-ఛత్తీస్గఢ్ బార్డర్లోని కర్రెగుట్టలో మావోయిస్టుల మందుపాతర పేలి ముగ్గురు గ్రే హౌండ్స్ జవాన్లు అసువులు బాశారు. మావోయిస్టుల మందుపాతరలో ప్రకాశం జిల్లా కొత్తముద్దపాడు గ్రామానికి చెందిన జవాన్ పవన్ కళ్యాణ్ కన్నుమూశాడు. మావోయిస్టుల దాడిలో మృతి చెందిన పవన్ కళ్యాణ్కు స్వగ్రామంలో ప్రభుత్వ లాంఛనాలతో అత్యక్రియలు జరిగాయి.