తెలంగాణ
Mahbubnagar: ప్రాణాలు తీసిన ఈత సరదా.. ముగ్గురు మృతి

Mahbubnagar: మహబూబ్ నగర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. దివిటిపల్లికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఈతకు వెళ్లి ప్రమాదవ శాత్తు ప్రాణాలు కోల్పోయారు. ఇళ్లకు సమీపంలో ఉన్న పాడుబడ్డ క్వారీలో ముగ్గురు ఈతకు వెళ్లారు. అయితే ఈత రాకపోవడంతో విజయ్, అయ్యప్ప, మహమూద్ అనే వ్యక్తులు నీళ్లలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీశారు. ఒకే ఊరుకు చెందిన ముగ్గురి మరణంతో వారి కుటుంబాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి.