TGSRTC: ఆర్టీసీ ఉద్యోగులకు యాజమాన్యం బహిరంగ లేఖ

TGSRTC: TGSRTC సిబ్బంది సమ్మెకు సిద్ధమవుతున్న నేపథ్యంలో సంస్థ యాజమాన్యం ఉద్యోగులను ఉద్దేశించి ఒక బహిరంగ లేఖను విడుదల చేసింది. సమ్మె ఆలోచనను విరమించుకోవాలని, సంస్థ అభివృద్ధికి సహకరించాలని కోరింది.
రాష్ట్ర ప్రభుత్వ, ఆర్టీసీ ఆర్థిక పరిస్థితులను వివరిస్తూనే, ఉద్యోగుల సంక్షేమానికి యాజమాన్యం ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని హామీ ఇచ్చింది. సమ్మె పేరుతో ఉద్యోగుల పట్ల బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది.
ఇదిలా ఉంటే చర్చలకు పిలకవపోతే సమ్మె తథ్యం అంటోంది TGSRTC జేఏసీ. ఇవాళ అర్థరాత్రి వరకు చర్చలకు ఆహ్వానం రాకపోతే రేపు ఉదయం నుంచే సమ్మెకు దిగుతామని ఆర్టీసీ జేఏసీ హెచ్చరించింది.
ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తి మృతి చెందాడు. ఆక్సిజన్ లెవెల్స్ అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులతో పాలవెల్లి మృతి చెందినట్టు సమాచారం. మృతుడు గాజువాక జీవీఎంసీ టాక్స్ కలెక్టర్ జి.పాలవెల్లిగా గుర్తించారు. పాలవెల్లి మృతదేహం ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. రేపు విశాఖకు తరలించనున్నారు. విశాఖ కూర్మన్నపాలెంలో పాలవెల్లి అంత్యక్రియలు జరగనున్నారు.