ఆంధ్ర ప్రదేశ్

ఉగ్ర మూలాలతో ఉలిక్కిపడ్డ విజయనగరం

విజయనగరం జిల్లా ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఉగ్రవాద ప్రేరేపిత కేసుకు సంబంధించి ఓ యువకుడు అరెస్టు అయినట్లు తెలిసి కలవర పడుతున్నారు. నగరానికి చెందిన సిరాజ్‌ఉర్‌ రెహమాన్‌తో పాటు హైదరాబాద్‌కు చెందిన సమీద్‌ సయ్యర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయనగరంలో టెర్రర్ లింక్స్ కేసు విచారణలో పోలీసులు జోరు పెంచారు. ఈ కేసులో అరెస్టైన సిరాజ్, సమీర్ కస్టడీ కోసం పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు.

ఇద్దరినీ కస్టడీకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇద్దరికీ ఐసిస్ మాడ్యుల్ ఆదేశాలిచ్చినట్లు పోలీసులకు సమాచారం అందింది. సౌదీ అరేబియా నుంచి సిరాజ్, సమీర్​కు మాడ్యుల్ అదేశాలిచ్చినట్లు సమాచారం. రంపచోడవరం అటవీ ప్రాంతంలో బాంబు పనితీరుపై రిహార్సల్ చేసినట్లు గుర్తించారు.

గత 6 నెలల్లో సిరాజ్ రెండు, మూడు సార్లు సౌదీ అరేబియా వెళ్లినట్టు పోలీసుల చేతిలో ట్రావెల్ హిస్టరీ ఉంది. వీటన్నింటీపైనా నిర్ధారణకు సిరాజ్, సమీర్​ని పోలీసులు కస్టడీకి కోరారు. నిందితులిద్దరికీ ఇప్పటికే విజయనగరం కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఇక ఇప్పుడు సిరాజ్, సమీర్​లను కస్టడీకి తీసుకునేందుకు పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. తద్వారా మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. నిందితులు ఇద్దరిని విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button