తెలంగాణ
Vikarabad: టీచర్ వేధింపులు.. స్కూల్ బిల్డింగ్ పైనుంచి దూకిన టెన్త్ విద్యార్థిని

Vikarabad: టీచర్ వేధింపులతో ఓ టెన్త్ విద్యార్థిని బిల్డింగ్ పైనుంచి దూకింది . ఫిబ్రవరి 24న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫిబ్రవరి 24 న వికారాబాద్ జిల్లా కొత్తగాడి ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ బిల్డింగ్ లోని మొదటి అంతస్తు పై నుంచి పదో తరగతి విద్యార్థిని తబిత దూకింది. ఈ ఘటనలో విద్యార్థిని కాలు విరిగిపోయింది.
ఎవరికి చెప్పొద్దని గుట్టు చప్పుడు కాకుండా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించింది హాస్టల్ సిబ్బంది. ఎవరికైనా చెబితే ఎగ్జామ్స్ రాయనివ్వబోమని ఉపాధ్యాయులు భయబ్రాంతులకు గురిచేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పలు విద్యార్థి సంఘాలు స్కూల్ బయట ఆందోళనకు దిగాయి.