తెలంగాణ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు వద్ద ఉద్రిక్తత

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్య కేసులో నిందితుడిగా ఉన్న హరిబాబును తమకు అప్పగించాలని రాజలింగమూర్తి భార్య కోర్టు వద్ద ఆందోళనకు దిగింది. హరిబాబును పోలీసులు న్యాయమూర్తి ముందు హాజరుపర్చారు. అనంతరం పోలీసులు సినీ ఫక్కీలో హరిబాబును జైలుకు తరలించారు.