తెలంగాణ
అమెరికాలో తెలంగాణ యువకుడు మృతి

అమెరికా గన్ కల్చర్కు ఇండియన్స్ బలి అవుతూనే ఉన్నారు. ఉన్నత చదువుల కోసం వెళ్లిన ఇండియన్స్.. ఏదో పార్ట్ టైమ్ జాబ్ చేసుకుంటూ స్టడీస్ పూర్తి చేస్తుంటారు. ఇదే అక్కడి యువతకు కడుపు మంటగా మారుతోంది. తాజాగా అమెరికాలోనీ మిల్వాంకి విస్కాన్సిన్ సిటీలో నివాసం ఉంటున్న తెలంగాణ యువకుడు చనిపోవడంతో రంగారెడ్డి జిల్లాలో విషాదం నింపింది.
కేశంపేట మండల కేంద్రానికి చెందిన గంప ప్రవీణ్పై దుండగులు కాల్పులు జరిపారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెల్లి ప్రవీన్ అక్కడే ఎంఎస్ సెకండ్ ఇయర్ చదువుతూ పార్ట్ టైంగా స్టోర్ లో జాబ్ చేస్తున్నారు. డ్యూటీ నుంచి వస్తుండగా దుండగులు కాల్పులు జరపడంతో ప్రవీణ్ అక్కడే చనిపోయాడు. ప్రవీణ్ ఇంటికి దగ్గర్లో ఉండే బీచ్ వద్ద గన్ తో కాల్చడంతో మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.