తెలంగాణ
Raj Bhavan: తెలంగాణ రాజ్భవన్లో చోరీ

Raj Bhavan: తెలంగాణ రాజ్భవన్లో చోరీ జరిగింది. సుధర్మ భవన్లోని నాలుగు హార్డ్ డిస్కులు చోరీ అయినట్లు రాజ్భవన్ అధికారులు గుర్తించారు. ఈ నెల 14న చోరీ ఘటన చోటుచేసుకోగా.., పంజాగుట్ట పోలీసులకు రాజ్భవన్ అధికారులు ఫిర్యాదు చేశారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హెల్మెట్ ధరించి కంప్యూటర్ రూమ్లోకి వచ్చిన వ్యక్తి చోరీకి పాల్ప డినట్లు పోలీసులు గుర్తించారు. దొంగలింపడిన హార్డ్ డిస్క్లలో రాజ్భవన్ వ్యవహారాలతోపాటు కీలకమైన రిపోర్టుల ఫైల్స్ ఉన్నట్లు రాజ్భవన్ సిబ్బంది తెలిపారు.