తెలంగాణ

Harish Rao: ఫలించిన హరీశ్ రావు ప్రయత్నం.. రంగనాయకసాగర్‌కు నీటి ఎత్తిపోతలు ప్రారంభం

Harish Rao: మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ప్రయత్నం ఫలించింది. మిడ్ మానేరు నుండి అన్నపూర్ణ రిజర్వాయర్ మీదుగా రంగనాయకసాగర్ రిజర్వాయర్‌లోకి తక్షణమే నీటిని విడుదల చేయాలని మంత్రి ఉత్తమ్ కి.. హరీశ్ రావు లేఖ రాశారు. ఎలాంటి స్పందన రాకపోవడంతో ఫోన్ చేసి రైతుల కష్టాల గురించి చర్చించారు హరీశ్.

వెంటనే నీరు ఎత్తిపోయకుంటే 50వేల ఎకరాల్లో పంట ఎండిపోతుందని వెల్లడించారు. యాసింగిపంట చేతికొచ్చేదాకా సాగునీటిని అందుబాటులో ఉంచాలని కోరారు. దీంతో అన్నపూర్ణ రిజర్వాయర్ నుండి రంగనాయకసాగర్ లోకి అధికారులు నీటిని విడుదల చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button