తెలంగాణ
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఇకపై 15 రోజులకోసారి కేబినెట్ మీటింగ్

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై నెలకు రెండు సార్లు కేబినెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. 15రోజులకోసారి భేటీ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. విధాన నిర్ణయాల్లో జాప్యాన్ని నివారించేందుకు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.
ప్రతినెల మొదటి, మూడో శనివారం కేబినెట్ భేటీ జరగనుంది. మం త్రులతో ఎప్పటికప్పుడు చర్చించేందుకు కేబినెట్ ఏర్పాటు చేశారు. కాగా తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్ ప్రభుత్వం ఇప్పటివరకు 17 సార్లు కేబినెట్ సమావేశం నిర్వహించింది.