తెలంగాణ
Jishnu Dev Varma: రాష్ట్ర అభివృద్ధే మా ప్రభుత్వ ధ్యేయం

Jishnu Dev Varma: రాష్ట్ర అభివృద్ధే మా ప్రభుత్వ ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని గవర్నర్ అన్నారు. 25 వేల కోట్ల రైతు రుణమాఫీ చేశామన్నారు. దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో వరి ఉత్పత్తి చేశామన్నారు. రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేశామన్నారు.
తెలంగాణ సర్కార్ ఆరోగ్యశ్రీ పరిధిని 10 లక్షలకు పెంచామన్నారు. కొత్తగా 163 సేవలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చామన్నారు. ఆరోగ్యశ్రీ పథకంతో ఎంతోమంది సామాన్యులకు న్యాయం జరుగుతుందన్నారు.