తెలంగాణ

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఇక నామినేటెడ్ పాలక మండళ్లుగా సహకార సంఘాలు

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నామినేటెడ్ పాలక మండళ్లుగా సహకార సంఘాల పాలకవర్గాలు ఏర్పాటు కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులకు ఎన్నికైన పాలకవర్గాలను రద్దు చేస్తూ ఈనెల 19న అధికారిక ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై నామినేటెడ్ పాలక మండళ్లుగా సహకార సంఘాల పాలకవర్గాలు ఏర్పాటు కానున్నాయి.

వ్యవసాయ మార్కెట్ కమిటీల తరహాలో నియామకాలు జరగనున్నాయి. రాబోయే సంక్రాంతి లోపు పాలకవర్గాల ఏర్పాటు లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ప్రతి పీఏసీఎస్‌కు 13 మందితో పాలకవర్గాలు ఏర్పాటు కానున్నాయి. అందులో చైర్మన్, వైస్ చైర్మన్‌తో పాటు 11 మంది డైరెక్టర్లు ఉంటారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మూడు డైరెక్టర్ పోస్టులు ఇవ్వనున్నారు. అయితే సొసైటీల్లో సభ్యత్వం ఉన్న రైతులకు మాత్రమే పాలకవర్గాల్లో అవకాశం కల్పించనున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button