తెలంగాణ
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ నిర్మిస్తున్న గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై రేపు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్వంలో ఎంపీల సమావేశం ఏర్పాటు చేసింది. సాయంత్రం 4గంటలకి సచివాలయంలో ఎంపీలు భేటీ కానున్నారు.
ఎంపీల సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నట్లు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ ఆధ్వర్యంలో ఎంపీల భేటీ కొనసాగనుండగా ఇప్పటికే రాజ్యసభ, లోక్సభ ఎంపీలకు ప్రభుత్వం ఆహ్వానం పంపింది.