తెలంగాణ
నేడు జరగాల్సిన తెలంగాణ కేబినెట్ సమావేశం వాయిదా

నేడు జరగాల్సిన తెలంగాణ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. కేబినెట్ సమావేశాన్ని వాయిదా వేస్తూ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్కి సంబంధించి అనేక అంశాలపై చర్చకు సిద్ధంగా ఉన్నప్పటికీ, సీఎం, పలువురు మంత్రులు ఢిల్లీ పర్యటనలో ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో జరుగుతున్న ఏఐసీసీ ఓబీసీ నేషనల్ కాన్ఫరెన్స్ కార్యక్రమంలో తెలంగాణ మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి పాల్గొంటున్నారు. ఇవాళ కూడా వీరు ఢిల్లీలోనే ఉండనున్నారు.
ఈ ముగ్గురితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఇరిగేషన్ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి కూడా ఢిల్లీలోనే ఉన్నారు. మొత్తం ఐదుగురు మంత్రులు ఢిల్లీలో ఉండటంతో కేబినెట్ సమావేశానికి కోరం లేకపోవడంతో సీఎం వాయిదా వేశారు. ఈనెల 28న మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించాలని నిర్ణయించారు.