ఆంధ్ర ప్రదేశ్
తేజేశ్వర్ మర్డర్ కేసులో కీలక పరిణామం

ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ మర్డర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితుడు తిరుమలరావును అరెస్ట్ చేసినట్లు టాక్ వినబడుతోంది. కడపలో ప్రధాన నిందితుడు తిరుమలరావును అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం గద్వాలలోని ఓ రహస్య ప్రాంతంలో విచారణ కొనసాగుతున్నట్లు తెలుస్తుంది.
అయితే ఈ పరిణామాలను గద్వాల పో లీసులు అధికారికంగా ప్రకటించలేదు. కాగా ఇప్పటికే పోలీసుల అదుపులో తేజేశ్వర్ భార్య ఐశ్వర్యతోపాటు తల్లి సుజాత.. నగేష్, పరుశరాం, రాజు, పలువురు నిందితులు ఉన్నారు. ఇక తేజేశ్వర్ మర్డర్ అనంతరం నిందితులు లడాఖ్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది.