జాతియం
అహ్మదాబాద్-లండన్ ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. సర్వీస్ రద్దు

Air India: దేశీయ విమానయాన సంస్థ ఎయిరిండియాలో వరుస ఘటనలు ఆందోళనలు కల్గిస్తున్నాయి. తాజాగా మరో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం ప్రయాణికులను కలవరపాటుకి గురిచేసింది. టేకాఫ్కు ముందే విమానంలో సాంకేతిక లోపాన్ని గుర్తించారు సిబ్బంది. దీంతో విమాన సర్వీసును రద్దు చేసింది ఎయిరిండియా.