ఆవు మెదడుతో పాఠాలు.. టీచర్ సస్పెండ్

ఆవు.. ఇది కేవలం ఓ మతానికి ధర్మానికి సింబల్ మాత్రమే కాదు. హిందువుల ఆరాధ్య దైవం. ఆవును తల్లి రూపంలో, తన ప్రజల సంరక్షకురాలిగా చూస్తారు. గోమాతను భూమి యొక్క దైవిక వరానికి చిహ్నంగా భావిస్తారు. స్వాతంత్రానికి ముందు కూడా గో సంరక్షణపై ఎన్నో ఉద్యమాలు సాగాయి. తిలక్, పటేల్ వంటివారు ఎందరో గోమాత ప్రాముఖ్యాన్ని భారతీయులకు విడమరచి చెప్పారు.
గోవు జాతి సంపదని దీన్ని చంపే హక్కు ఎవరికీ లేదని గతంలో కొన్ని రాష్ట్రాల కోర్టులు కూడా ఆదేశించిన సందర్భాలున్నాయి. అయితే ప్రస్తుతం వికారాబాద్ జిల్లాలో జరిగిన ఓ సంఘటన యావత్తు దేశాన్నే ఆలోచనలో పడేలా చేసింది. పాఠశాలలో ఒక ముస్లీం టీచర్ చేసిన పనిపై హిందూ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఇంతకీ ఆ టీచర్ ఏం చేసింది..? ఎందుకు హిందూ సంఘాలు అంతలా మండిపడుతున్నాయి.
వికారాబాద్ జిల్లా యాలాల మండలం పరిధిలోని జడ్పీహెచ్ఎస్ బాలిక ఉన్నత పాఠశాలలో ఘోరం జరిగింది. స్థానిక సైన్స్ టీచర్ ఖాసీం బి పదవ తరగతి క్లాస్ రూమ్లోకి ఆవు మెదడను తీసుకొని వచ్చింది. బ్రెయిన్ ఇలా ఉంటుందని చూపిస్తూ ఫోటోలు దిగుతూ ఫోజులిచ్చింది. ఆ ఫోటోలను స్కూల్ గ్రూప్లో ఫోస్ట్ చేయడంతో విషయం బయటకు వచ్చింది. ఇది చూసిన స్కూల్ పిల్లలు తీవ్ర భయాందోళనకు గురైయ్యారు.
ఈ విషయం కాస్త బయటకు పాకడంతో బిజెపి నాయకులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. హిందు వాదులతో కలిసి స్కూల్ ముందు ధర్నాకు దిగారు. టీచర్ ను వెంటనే సస్పెండ్ చేయాలని ఇలాంటి చేష్టలు చేయడం తప్పని హెచ్చరించారు. స్కూల్ టీచర్ ఉండి ప్రత్యక్షంగా ఇలా బ్రెయిన్ చూపించడం అది కూడా ఆవు ది అని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. త్రీడీ ఎల్ఈడీలో కూడా బ్రెయిన్ను చూపించి వివరించవచ్చని తెలిపారు. ఈ వివాదం కాస్తా ఆమె ఉద్యోగానికే ఎసరుపెట్టింది.
ఈ వ్యవహారంపై స్థానిక హిందువాదులు, బీజేపీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గోమాతగా భావించే ఆవు మెదడుతో ఇలా విద్యార్థులకు అవగాహన కల్పించడం ఏంటని మండిపడ్డారు. భారీ సంఖ్యలో ఇందువులు జెడ్పీహెచ్ఎస్ స్కూల్ వద్దకు చేరుకొని ధర్నాకు దిగారు. సదురు సైన్స్ టీచర్పై చర్యలు తీసుకోవాలని ఆమెను వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
మరోవైపు స్కూల్ వద్ద గందరగోళం నెలకొన్ని విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్కూల్ వద్ద ఆందోళనకు దిగిన హిందూవాదులకు, బీజేపీ నాయకులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు.
ఉపాధ్యాయురాలు విద్యార్థులకు మానవ మెదడు పనితీరుపై అవగాహాన కల్పించాలనుకున్నారేమో విద్యార్థులకు చక్కగా అర్థం అయ్యే విధంగా వివరించేందుకు ప్రయత్నం చేసిందిమో కానీ ఉదహారణగా ఒక ఆవు మెదడును తరగతి గదిలోకి తీసుకురాడం కరెక్ట్ కాదు అంటున్నారు తోటి ఉపాధ్యాయులు. కానీ..ఆవు మొదడును ఇలా తీసుకురావడం కరెక్ట్ కాదు అంటున్నారు. ఈ విషయం స్థానిక హిందువుల దృష్టికి చేరడంతో ఇది కాస్తా వివాధానికి దారి తీసింది.
కాగా గోవధను నిషేధించాలని మనదేశంలో దశాబ్దాలుగా డిమాండ్ ఉంది. వ్యవసాయ అవసరాల కోసం మాత్రమే పశువులను కొనుగోలు చేయాలి వధించడం కోసం కాదని మోడీ ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే గోవధ నిషేధం అమల్లో ఉంది. చట్టం ప్రకారం గోవులను వధిస్తే మూడు నుంచి ఏడేళ్లు జైలుశిక్ష, 50 వేల రూపాయల నుంచి 5 లక్షల వరకు జరిమానా విధిస్తారు.
13ఏళ్లు నిండిన ఆవులు, గేదెలను పశుసంవర్ధక శాఖ అనుమతితో వధించే వీలుంది. గుజరాత్, ఉత్తరప్రదేశ్లో ఈ చట్టం అమల్లో ఉంది. బక్రీద్ సందర్భంగా దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో గోవధ జరగటాన్ని అడ్డుకునేందుకు ఎప్పటినుంచో పలు హిందూ సంస్థలు పోరాడుతూనే ఉన్నాయి.
గోవులు భారతదేశ పవిత్రమైన సంపద అని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు గతంలో స్పష్టం చేసింది. గోవు జాతి సంపద, చంపే హక్కు ఎవరికీ లేదంటూ ఏపీ, తెలంగాణలకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఆవు, ఎద్దు, దూడలు ఆరోగ్యంగా ఉన్నప్పుడు అందుకు విరుద్దంగా వధకు అనుకూలమైనవేనంటూ సర్టిఫికేట్ ఇచ్చే పశువుల వైద్యులపై గోవధ నిషేధ చట్టం కింద చర్యలు తీసుకునేందుకు వీలుగా చట్ట సవరణలు తీసుకురావాలని ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. ఇలా ధృవీకరణ పత్రాలు ఇచ్చిన వైద్యుడిపై మోసం, హాని కింద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది.
బాలగంగాధర్ తిలక్, లాలాలజపతిరాయ్, సర్దార్ వల్లభాయ్ పటేల్, స్వామి దయానంద, పండిత మదనమోహన మాలవ్య వంటి ఎంతోమంది.. గోరక్షణకై కృషిచేశారు. గోరక్ష ఈ దేశంలోని ప్రతి పౌరుడి ప్రథమ కర్తవ్యం ఆవు పాలు నెయ్యి ద్వారానే భారతీయుల జీవనం సాగుతుందని లాలాలజపతిరాయ్ అన్నారు. గోరక్షణలోనే ఈ దేశ రక్షణ ఉందని మదన్ మోహన్ మాలవ్య అంటారు. గోవధ మాతృహత్యతో సమానమంటూ వినోబాభావే అంటారు.
అసలు గోవధ అంటే అది మన సంస్కృతి, సంప్రదాయాలపై జరుగుతున్న దాడి అంటారు ఆర్ఎస్ఎస్ ద్వితీయ సర్ సంఘ్ చాలక్ గురుజీ అంటారు. మనదేశంలో వ్యవసాయాభివృద్ధి, పేదరిక నిర్మూలనకు గోరక్ష ఏకైక మార్గం వ్యవసాధార దేశంలో ఆవు కామధేనువు వంటిదని మన జీవన విధానం మనకు బోధిస్తోంది. ఆవు కేవలం ధార్మిక చిహ్నమే కాదు.. ఆర్థిక, సాంస్కృతిక మూలకేంద్రమని కూడా మనం గుర్తుంచుకోవాలి.
అయితే ఆ ముస్లిం టీచర్కు ఆవు బ్రెయిన్ ఎక్కడి నుంచి వచ్చింది. ఎవరు ఇచ్చారు దీని వెనుక ఎవరు ఉన్నారు..? నిజంగా గోవధ జరిగిందా..? అనేది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది.