ఆంధ్ర ప్రదేశ్
నంద్యాల జిల్లాలో కీచక ఉపాధ్యాయుడు సస్పెండ్

నంద్యాల జిల్లాలో విద్యార్థినులను వేధిస్తున్న టీచర్ను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం ఏనుగుమర్రి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు బొజ్జన్న. అయితే తమ టీచర్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థినిలు తల్లిదండ్రులుకు చెప్పారు.
దీంతో వారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. జోక్యం చేసుకున్న పోలీసులు ప్రాథమిక విచారణ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. కాగా గత రెండు రోజులుగా ఉపాధ్యాయుడు బొజ్జన్న స్కూల్ రావడం లేదు.