ఆంధ్ర ప్రదేశ్
Varla Ramaiah: మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్ట్ పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు

Varla Ramaiah: మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్ట్ పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. గతంలో విచ్చలవిడిగా రెచ్చిపోయి దౌర్జన్యాలకు పాల్పడిన వైసీపీ నేతల పాపాలు ఒక్కొక్కటిగా పండుతున్నాయి అన్నారు. అరాచకానికి పాల్పడిన వ్యక్తులు ఎక్కడ ఉన్నా.. ఎప్పటికైనా శిక్ష అనుభవించి తీరాల్సిందే అని తెలిపారు.
పట్టిసీమ మట్టిని అప్పనంగా కొట్టేసిన దోపడిదారుడు అని ఆరోపణలు చేశారు. ఆలస్యమైనా చట్టం ముందు దోషికి శిక్ష పడాల్సిందే అంటు చెప్పుకొచ్చారు. ఇటువంటి అరాచక శక్తులు గన్నవరంతో పాటు విజయవాడ, గుడివాడ, బందర్ అనేక చోట్లలో ఉన్నారని….వారందరికీ కూడా జైలుకు వెళ్లే రోజు దగ్గర్లోనే ఉందన్నారు వర్ల రామయ్య