ఆంధ్ర ప్రదేశ్
కడప జడ్పీ చైర్మన్ ఎన్నికపై వైసీపీకి టీడీపీ షాక్

కడప జడ్పీ చైర్మన్ ఎన్నికపై వైసీపీకి టీడీపీకి షాక్ ఇచ్చింది. చైర్మన్ ఎన్నికను నిలిపివేయాలని టీడీపీ జడ్పీటీసీ జయరామిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఖాళీగా ఉన్న ఒంటిమిట్ట, పులివెందుల జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించకుండా చైర్మన్ ఎన్నిక జరపడంపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది.
చైర్మన్ ఎన్నిక వాయిదా వేసి రెండు జడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు జరపాలని పిటిషన్ దాఖలు చేసింది. జడ్పీ చైర్మన్ ఎన్నిక ఆపాలంటూ హైకోర్టులో మరికొన్ని పిటిషన్లు దాఖలు కావడంతో రేపు జరగాల్సిన జడ్పీ చైర్మన్ ఎన్నికపై సందిగ్ధత నెలకొంది.