తెలంగాణ
Talasani: సికింద్రాబాద్లో పర్యటించిన మాజీమంత్రి తలసాని

Talasani: సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రజలకు సూచించారు. వెస్ట్ మారెడ్పల్లిలోని ఆయన కార్యాలయంలో 44 మంది కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు కార్పొరేటర్లు, అధికారులు, నాయకులతో కలిసి చెక్కుల పంపిణీ చేశారు.
ఇప్పటికే లబ్ధి పొందిన వారు తమ పరిసరాల్లోని అర్హులైనవారు లబ్ధిపొందేలా అవగాహన కల్పించాలని కోరారు. పేద, మధ్య తరగతి ప్రజలకు మేలు జరిగేలా అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.