తెలంగాణ
Talasani: కేసీఆర్ ఏం మాట్లాడతారనేదానిపై అందరికీ ఉంత్కంఠ

Talasani: బీఆర్ఎస్ రజతోత్సవ దినోత్సవాన్ని పురస్కరించుకొని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్ లో పార్టీ జెండా ఎగురవేశారు. రాంగోపాల్ పేట్ డివిజన్ జనరల్ బజార్, బన్సిలాల్ పేట్ జబ్బర్ కాంప్లెక్స్ వద్ద.. అలాగే పద్మారావు నగర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద గులాబీ జెండాను ఆవిష్కరించి పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు.
25 వసంతాల వేడుకలు జరుపుకుంటున్న ఏకైక తెలంగాణ ప్రజల పార్టీ బీఆర్ఎస్ అని తెలిపారు తలసాని యాదవ్. నేడు వరంగల్ ఎల్కతుర్తిలో జరుపుకోబోతున్న సభ చరిత్ర పుటల్లో నిలిచిపోతుందని పేర్కొన్నారు. కనీవినీ ఎరుగని రీతిలో జరుగనున్న జనసభలో కేసీఆర్ ఏం మాట్లాడతారని రాజకీయ పార్టీల నేతలే కాదు ప్రపంచంలోని తెలుగు ప్రజలంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారని అన్నారు.