తెలంగాణ
మహంకాళీ అమ్మవారి బోనాల ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే తలసాని

సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాకాళి ఆలయ పరిసర ప్రాంతాలను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులతో కలిసి సందర్శించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాతరను విజయవంతంగా జరిపేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు తలసాని సూచించారు.
రాజకీయాలకు ఆస్కారం ఇవ్వకుండా అందరం కలిసిమెలసి లష్కర్ బోనాలను జరుపుకోవాలని మాజీ మంత్రి తలసాని పిలుపునిచ్చారు. బోనాల జాతరకు ఇతర దేవాలయాలకు డబ్బులు ఇచ్చే ఒరవడిని కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ప్రభుత్వానికి తలసాని సూచించారు.