జాతియం

Tahawwur Rana: తహవ్వూర్ రాణాను 18 రోజుల NIA కస్టడీ

Tahawwur Rana: ముంబై బాంబు దాడుల కీలక సూత్రధారి నరహంతకుడు తహవూర్ రాణాకు పాటియాలా కోర్టు 18 రోజుల కస్టడీ విధించింది. రాణాను 20 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఎన్ఐఏ కోరగా న్యాయస్థానం 18 రోజుల కస్టడీకే అనుమతిచ్చింది. రాణా ఎన్ఐఏ అదుపులో ఉండటంతో NIA కేంద్ర కార్యాలయం దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు.

తహవ్వుర్ రాణాను భారత్‌కు అమెరికా అప్పగించింది. అంతేకాదు 2011లో ఆ దాడుల్లో రాణా ప్రత్యక్ష పాత్ర లేదని అమెరికా న్యాయస్థానం తేల్చింది. దీంతో తహవ్యుర్ అమాయకు డని చెప్పడం భారత సార్వభౌమత్వాన్ని అవమానించడమేనని గతంలో ట్వీట్ చేశారు నరేంద్ర మోదీ. ఇప్పుడు మోదీ పాత పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

భారత్‌కు రాణా అప్పగింతపై తాజాగా అమెరికా స్పందించింది. ప్రపంచ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో నిబద్ధత చూపుతూ భారత్‌కు తహవ్వుర్‌ను అప్పగించామనిపేర్కొంది అమెరికా. ముంబై ఉగ్రదాడుల్లో రాణా ప్రమేయంపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో అప్పగించామని అమెరికా చెబుతోంది. అదేవిధంగా బాంబు దాడుల్లో 166 మంది చనిపోయారని అందులో ఆరుగురు అమెరికా పౌరులు ఉన్నారని వెల్లడించింది.

మరోవైపు తహవూర్ రాణా తమ పౌరుడు కాదంటూ పాక్ తెలిపింది. ఈ మేరకు పాక్ విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘గడచిన రెండు దశాబ్దాల్లో రాణా తన పాక్ పత్రాలను పునరుద్ధరించుకోలేదు అతడు కెనడా జాతీయుడనేది సుస్పష్టం’ అని చెప్పుకొచ్చింది. మరోవైపు ముంబై ఉగ్రదాడుల్లో పాక్ నిఘా సంస్థ ISI పాత్ర ఉందన్న విషయం రాణాపై విచారణ అనంతరం బయటికొస్తుందని NIA వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button