లైలా వివాదాన్ని మరింత రాజేసిన కమెడియన్ పృథ్వీ

సినిమాని సినిమాలా చూడాలి. ముఖ్యంగా ఈ తరం వస్తున్న సినిమాలను థియేటర్లో చూశామా బయటకొచ్చాక మర్చిపోయామా అనేలా ఉండాలి. దాన్ని ఆదర్శంగా తీసుకున్నా ప్రమాదమే. అయితే కొత్త హుషారుతో ముందుకొచ్చి కొత్త స్టోరీలతో సినిమాలు తీస్తున్న హీరోలు కోకొల్లలు. ఒక్కో దర్శకుడు ఒకలా స్టోరీ రాస్తాడు. కథకు తగినట్లుగా నటించడం నటుడి ముందున్న అతిపెద్ద సవాల్. ఈ క్రమంలోనే తాజాగా సినిమా చరిత్రలో చిచ్చు రాజుకుంది. లైలా సినిమాలో నటించిన కమెడియన్ పృథ్వీ నిప్పు రాజేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఎటు దారితీస్తాయో అని ఆందోళనగా ఉంది.
చేసిన తప్పుకి.. వాగిన వాగుడుకి క్షమాపణ చెప్పాల్సింది హీరో విశ్వక్ సేన్ కాదు.. ఆ వాగిన కమెడియన్ పృథ్వీ క్షమాపణ చెప్పాలని ఓ వైపు వైసీపీ శ్రేణులు డిమాండ్ చేస్తుంటే.. బొక్కేం కాదు అంటూ రెచ్చగొట్టే వాఖ్యలు చేశారు కమెడియన్ పృథ్వీ. Boycott Laila అంటూ విశ్వక్ సేన్ కొత్త చిత్రంపై పెద్ద ఎత్తున నెగిటివ్ ప్రచారం జరుగుతుండగా.. ఆ వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేయకుండా.. బూతులతో రెచ్చిపోయారు కమెడియన్ పృథ్వీ.
ఏ నటుడికైనా పిలిచి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత ఉంటుంది. తనకి అవకాశం ఇచ్చిన నిర్మాత పది కాలాల పాటు చల్లగా ఉండాలని.. ఆ సినిమా మంచిగా ఆడాలని కోరుకుంటాడు. కానీ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నారు. తాను చేసిన వ్యాఖ్యల వల్ల ‘లైలా’ సినిమా బాయ్ కాట్ అయ్యే పరిస్థితి వచ్చినా కూడా.. ఏ మాత్రం వెనక్కితగ్గకుండా ఈ వివాదాన్ని మరింత రాజేశారు.
ఓ పక్క హీరో విశ్వక్ సేన్, లైలా నిర్మాతలు ప్రెస్ మీట్ పెట్టి మరీ.. జరిగిన తప్పుకి క్షమాపణ చెప్తుంటే.. ఆ వివాదానికి కారణమైన కమెడియన్ పృథ్వీ మాత్రం మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి బూతులతో విరుచుకుపడ్డారు.
సినిమాని సినిమాలా చూడకుండా.. సినిమా ఫంక్షన్లలో రాజకీయాలను మాట్లాడటం అలవాటుగా చేసుకున్న కమెడియన్ పృథ్వీ.. లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పదకొండు అంటూ.. వైసీపీ పార్టీపై పరోక్షంగా విమర్శలు చేశారు. ఈ సినిమాలో తనది మేకల సత్తి పాత్ర అని.. అందులో మొదట 150 మేకలు ఉంటాయని.. చివరికి వచ్చేసరికి 11 మాత్రమే మిగిలాయంటూ నోటి దూల చూపించాడు.
అయితే ఆ నోటి దూలకి అడ్డుకట్ట వేసేందుకు వైసీపీ శ్రేణులు.. #Boycott Laila అంటూ ట్వీట్ మోత మోగించారు. వైసీపీ ట్వీట్ల దాడికి #Boycott Laila టాప్ ట్రెండింగ్లో ఉందంటే.. కమెడియన్ పృథ్వీ కామెంట్లను వాళ్లు ఎంత సీరియస్గా తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. అంతకు ముందు గేమ్ ఛేంజర్ ఈవెంట్లోనూ ఇలాగే నోరుపారేసుకున్నాడు కమెడియన్ పృథ్వీ. ఒకప్పుడు వైసీపీ పార్టీకి కొమ్ముకాసిన ఈయనే.. ఆ పార్టీపై విమర్శలు గుప్పించడానికి సినిమా ఈవెంట్లను వేదికగా మార్చుకుని.. గేమ్ ఛేంజర్ సినిమా ఎలక్షన్స్కి ముందు రిలీజ్ అయితే.. వైసీపీ పార్టీకి ఆ 11 కూడా వచ్చేవి కాదని.. జీరో వచ్చేదని సెటైర్లు వేశారు. మళ్లీ లైలా ఈవెంట్లోనూ ఈ పదకొండు మ్యాటరే తీసుకొచ్చి.. అత్యుత్సాహం చూపించారు పృథ్వీ.
అయితే పృథ్వీకి సంస్కారం నేను నేర్పలేను కదా.. ఆయన అనుభవం అంత వయసు నాకు లేదంటూ తప్పు లైలా ఈవెంట్లోనే జరిగింది కాబట్టి.. బాధ్యత వహిస్తూ క్షమాపణ చెప్పారు హీరో విశ్వక్ సేన్. అయితే తప్పు చేసిన వ్యక్తే క్షమాపణ చెప్పాలని #Boycott Laila హ్యాష్ ట్యాగ్తో ట్వీట్ల మోత మోగిస్తూనే ఉన్నారు వైసీపీ శ్రేణులు.
ఇలాంటి సందర్భంలో చేసిన తప్పుని ఒప్పుకుని ఆ సమస్యకి చెక్ పెట్టి.. లైలా చిత్ర యూనిట్ని సేవ్ చేస్తారని అనుకుంటే.. సేవ్ చేయడం మాట అటుంచితే.. ఆ సినిమాని మరింత చిక్కుల్లో పడేశారు కమెడియన్ పృథ్వీ. క్షమాపణ చెప్పడం అటుంచితే.. వైసీపీ శ్రేణులపై బూతులతో విరుచుకుపడ్డారు కమెడియన్ పృథ్వీ.
దరిద్రపు నా కొడకల్లారా.. ఏంటిరా మీకు నొప్పి. ఇంత జరిగినా మీకు బుద్దిరాలేదు. మొన్న లైలా ఫంక్షన్లో నేను ఆ సినిమాలో వేసిన క్యారెక్టర్ గురించి మాట్లాడాను. నాది అందులో మేకల సత్తి అనే క్యారెక్టర్. నాకూడా మేకలు ఉంటాయి.. చివరికి పదో పదకొండో మేకలు ఉంటాయని అన్నాను. కామెడీగా ఉంటుందని ఫంక్షన్లో అది మాట్లాడాను. నేనేమో వైసీపీ పార్టీని విమర్శించలేదు.. గెలిచిన 11 మంది ఎమ్మెల్యేల గురించి మాట్లాడలేదు. అంత నీఛంగా మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. మా నాయకుడు అధికారంలోకి వచ్చేశాడు. వీళ్ల గురించి మాట్లాడాల్సిన అవసరం మాకేం ఉంది. ప్రతిదీ రాజకీయం చేస్తున్నారు. ఏదైనా ఉంటే నా మీద పడి ఏడ్వండి. ఒకప్పుడు అలాగే ఏడ్చారు. అధపాతాళానికి పోయారు. అయినా మీకు సిగ్గు, లజ్జ లేదు.
సినిమాని సినిమాగా చూడండ్రా. ఈ విషయాన్ని సైబర్ క్రైమ్ దగ్గరకు తీసుకుని వెళ్తాను. ఏనా కొడుకులైతే నన్ను వేధిస్తున్నారో వాళ్లందరిపైన కంప్లైంట్ పెడతా. అస్సలు గ్యాప్ ఇవ్వకుండా ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఇప్పటికి 400 పైగా ఫోన్లు వచ్చాయి. ఒకడేమో కడప అంటాడు.. ఇంకొకడేమో డిప్యూటీ సీఎం తాలూకా అంటాడు. వాళ్ల నెంబర్ కూడా రికార్డ్ చేసి పెట్టాను. ఇంకొకడు యూఎస్ నుంచి ఫోన్ చేసి జగన్ మోహన్ రెడ్డి బ్రదర్ అని అంటాడు. వీళ్లకి తల్లులు లేరా? రోడ్డు సైడ్ పందులకు పుట్టారా?
ఒక నటుడిగా నేను నటించే సినిమా బాగా ఆడాలి.. బిజినెస్ పరంగా ముందు తీసుకుని వెళ్లాలి.. నిర్మాతలకు డబ్బులు రావాలి. మాకు అవకాశం ఇచ్చి భోజనం పెట్టిన నిర్మాత బాగుండాలని కోరుకునే వ్యక్తుల్లో మొదటి వ్యక్తిని నేను. అలాంటి నా ఫోన్ నెంబర్ని ఆన్ లైన్లో పెట్టి.. సెకన్కో ఫోన్ చేస్తున్నారు. నాకు ఫోన్ చేసిన ప్రతినా కొడుకునీ.. నేను సైబర్ క్రైమ్లో ఇరికించకపోతే అప్పుడు అడగండి. ఒక్కొక్కడికీ మోత ఎక్కిస్తాను. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ అంటే అప్పుడు తెలుస్తుంది’ అంటూ హెచ్చరించాడు కమెడియన్ పృథ్వీ.