తెలంగాణ
SLBC వద్ద రెస్క్యూను పరిశీలించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి SLBC లో జరగుతున్న సహాయకచర్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి టన్నెల్ లోపల చిక్కుకున్న వారి కోసం 24 గంటలు సహాయక చర్యలు పనిచేస్తున్నాయన్నారు. దేశవ్యాప్తంగా 10 రెస్క్యూ టీంలు ఇక్కడ పనిచేస్తున్నాయని తెలిపారు. రిస్క్యూ బృందాలు 40 మీటర్ల లోతు వరకు వెళ్లి వచ్చాయన్నారు.
అయితే ఇటువంటి సమయంలో ప్రతిపక్షాలు రాజకీయాలు చేసే సమయం కాదని అన్నారు. 24 గంటల్లో ప్రమాద స్థలానికి రెస్క్యూ బృందాలు చేరుకుంటాయని అన్నారు. ప్రమాదంలో చిక్కుకుపోయిన కుటుంబాలకు అండగా నిలబడతామంటున్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి.