తెలంగాణ
Eatala Rajendar: దేవాలయాలపై జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి

Eatala Rajendar: హైదరాబాద్ జగద్దిరిగుట్టలోని 17 దేవాలయాలను ఖాళీ చేయాలని హైడ్రా నోటీసులు జారీ చేసింది. హైడ్రా నోటీసులపై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయాలు హిందువుల విశ్వాసాలకు ప్రతీక అని ఈటల రాజేందర్ అన్నారు. దేవాయాలను సంరక్షించాల్సిన ప్రభుత్వమే కూల్చేందుకు ప్రయత్నిస్తుందని ఆయన విమర్శించారు.
మొగల్ పాలకుల గతంలో దేవాలయాలను కూల్చేందుకు ప్రయత్నాలు చేశారు..ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ పాలనలో అలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు. దేవాలయాలపై జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఈటల రాజేందర్ హెచ్చరించారు.